Tuesday, May 14, 2024

Breaking: రెండో టీ20లోనూ భార‌త్ ఓట‌మి.. 4 వికెట్ల తేడాతో సౌథాఫ్రికా విజ‌యం

భారత్‌తో జరగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిచింది. 5 మ్యాచ్​ ల సిరీస్​లో 2.0తో భారత్​పై ఆధిక్యం కనబరుస్తోంది. ఇక.. ఆరంభంలో భువనేశ్వర్ కుమార్ విజృంభించినప్ప‌టికీ ద‌క్షిణాఫ్రికా జోరును అడ్డుకోలేక‌పోయారు. పవర్‌ప్లే ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయిన జట్టును కెప్టెన్ బవుమా (35), కీపర్ క్లాసెన్ ఆదుకున్నారు.

వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరిగెత్తించారు. ముఖ్యంగా క్లాసెన్ బౌండరీలతో ఎదురు దాడికి దిగాడు. చాహల్, అక్షర్ వేసిన ఓవర్లలో వీళ్లు భారీ షాట్లు ఆడారు.

ఇదే ఊపులో చాహల్ వేసిన 13వ ఓవర్ తొలి బంతికి బౌండరీ బాదిన బవుమా.. ఆ తర్వాతి బంతిని కూడా భారీ షాట్ ఆడబోయాడు. ఈ క్రమంలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో సఫారీ జట్టు 13.3 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 100 పరుగులతో నిలిచింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన బ్యాట్స్‌మ‌న్‌లో మ‌రో ఇద్ద‌రు అవుట‌య్యారు..

- Advertisement -

ఇక లాస్ట్‌లో డేవిడ్ మిల్ల‌ర్‌, క‌సిగో ర‌బ‌డా నాటౌట్‌గా నిలిచారు. మొత్తానికి ఈ మ్యాచ్‌లోనూ ఇండియా ఓట‌మి చ‌విచూడ్డంతో క్రికెట్ అభిమానులు నిరాశ‌తో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement