ఏఎఫ్సీ ఆసియాకప్ క్వాలిఫయింగ్లో భాగంగా శనివారం రాత్రి భారత్-ఆఫ్గానిస్తాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా 2-1తో ఆఫ్గానిస్తాన్ పై విజయం సాధించింది. మ్యాచ్ ముగిసింది అనుకున్న తరుణంలో క్రీడాకారులంతా మైదానం వీడి వెళ్తున్న సమయంలో ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరినొకరు తోసుకుంటూ ఘర్షణ పడ్డారు. ఓడిపోయామన్న బాధను ఆఫ్గాన్ ఆటగాళ్లు జీర్ణించుకోలేక పెవిలియన్ వెళ్తున్న ఇద్దరు భారత ఆటగాళ్ల వైపు దూసుకొచ్చి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు.
చీటింగ్ చేసి మ్యాచ్ గెలిచారంటూ అసహనం వ్యక్తం చేశారు. దీనికి భారత్ ఆటగాళ్లు కూడా కౌంటర్ ఇవ్వడంతో ఒకరినొకరు తోసుకున్నారు. ఘర్షణ పెద్దది అవుతున్న తరుణంలో ఆసియన్ ఫుట్బాల్ కాన్ఫిడరేషన్(ఏఎఫ్సీ) అధికారులు వచ్చి ఆటగాళ్లకు సర్దిచెప్పి పంపించేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.