Thursday, May 16, 2024

IND vs PAK: భార‌త్ టార్గెట్ 192 ప‌రుగులు

అహ్మదాబాద్‌లో ప్రపంచ కప్ లో భాగంగా ఇవాళ భారత్‌ vs పాక్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేప‌ట్టిన పాకిస్తాన్ జట్టు 42.5 ఓవ‌ర్ల‌లో 191 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పాక్ బ్యాట్స్ మెన్లు బాబ‌ర్ ఆజ‌మ్ 50 ప‌రుగులు, మ‌హ‌మ్మ‌ద్ రిజ్వాన్ 49 ప‌రుగులు, ఇమామ్ ఉల్ హ‌క్ 36 ప‌రుగులు, అబ్దుల్లా ష‌ఫీక్ 20 ప‌రుగులు చేశారు.

మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట్స్ మెన్లు ఓ మేర‌కు బ్యాటింగ్ చేప‌ట్ట‌డంతో స్కోరు భారీ స్కోరు దిశ‌గా వెళ్తుంద‌నుకున్నారు. అయితే వ‌రుస‌గా వికెట్లు కోల్పోవ‌డంతో త‌క్కువ స్కోరుకే ఆలౌట్ అయ్యింది. దీంతో భార‌త్ జ‌ట్టు విజ‌య‌ల‌క్ష్యాన్ని చేరుకోవాలంటే 192 ప‌రుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement