Wednesday, May 8, 2024

IND vs ENG: మిగిలిన 3 టెస్టులకు భారత్ జట్టు ఇదే..

ఢిల్లీ: భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య మూడవ టెస్ట్ ఈనెల 15న రాజ్‌కోట్‌లో ప్రారంభమవుతుంది. నాల్గవ టెస్ట్ ఈనెల 23 నుంచి రాంచీలో మొదలుకానుంది. సిరీస్‌లోని ఐదవ, చివరి టెస్ట్ మార్చి 7 నుంచి ధర్మశాలలో జరగనున్నాయి.

3 టెస్టులకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ..
ఇంగ్లాండ్‌తో చివరి మూడు టెస్టు మ్యాచ్‌లకు జట్టును బీసీసీఐ ప్రకటించింది. జట్టు ఇదే: రోహిత్‌ (C), బుమ్రా, జైస్వాల్‌, గిల్‌, కేఎల్‌ రాహుల్‌, రజత్‌ పటీదార్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, జురెల్‌(WK), కేఎస్‌ భరత్ (WK), అశ్విన్‌, జడేజా, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌, కుల్‌దీప్‌, సిరాజ్‌, ముకేశ్‌, ఆకాశ్‌ దీప్‌. విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల మిగిలిన సిరీస్‌ల ఎంపికకు అందుబాటులో లేడని ప్రకటించింది. కోహ్లీ నిర్ణయాన్ని బోర్డు పూర్తిగా గౌరవిస్తుందని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement