Sunday, May 5, 2024

IND vs ENG, 4th Test : ఇండియ‌న్ బ్యాట‌ర్స్ విఫ‌లం… భారీ ఆధిక్యం దిశ‌గా ఇంగ్లండ్…

రాంచీ టెస్టులో టీమిండియా బ్యాట‌ర్స్ విఫ‌ల‌మ‌య్యారు.. య‌శ‌స్వీ జైశ్వాల్ మిన‌హా మిగిలిన బ్యాట‌ర్స్ స్వ‌ల్ప స్కోర్ల‌కే వెనుతిరిగారు. . ఇవాళ ఆటకు రెండో రోజు కాగా… ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 353 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 181 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

సూపర్ ఫామ్ లో ఉన్న టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 73 పరుగులు చేయగా, శుభ్ మాన్ గిల్ 28, రజత్ పాటిదార్ 17, రవీంద్ర జడేజా 12 , స‌ర్ప‌రాజ్ ఖాన్ 14, అశ్వీన్ ఒక్క ప‌రుగులు చేసి ఔట‌య్యారు.. జురేల్ 12 ప‌రుగుల‌తో, కుల‌దీప్ నాలుగు ప‌రుగుల‌తో క్రీజ్ లో ఉన్నారు. ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ 4 వికెట్లతో టీమిండియా టాపార్డర్ ను దెబ్బతీశాడు. ఆండర్సన్ ఒక వికెట్ తీశాడు. టామ్ హ‌ర్టీలీకి రెండు వికెట్లు ద‌క్కాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement