Monday, May 6, 2024

AP- భార్యా పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటా – చంద్రబాబుకు ఆగిపోగు ప్రభాకర్ అల్టిమేటం …

కోడుమూరు – టిడిపి టికెట్ దక్కలేదని.. కోడుమూరు టిడిపి నాయకులు, ఆకే పోగు ప్రభాకర్ కన్నీరు పెట్టుకున్నారు. 2024 ఎన్నికల్లో పోటీ చేసే టిడిపి తొలి జాబితాను శనివారం ఆ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి విధితమే. ఈ క్రమంలో నిన్నటి వరకు కోడుమూరు టికెట్ తనదే అన్న ధీమాతో ఉన్న టిడిపి రాష్ట్ర నాయకులు ఆకే పోగు ప్రభాకర్ ను కాదని.. బొగ్గుల దస్తగిరికి పార్టీ అధిష్టానం చేసింది. దీంతో మీడియాతో సమావేశమైన ఆకే పోగు ప్రభాకర్ చంద్రబాబు, లోకేష్ లపై మండిపడ్డారు.

30 ఏళ్లుగా పార్టీ కోసం కృషి చేశానని, ఏ పార్టీకి వెళ్లకుండా సేవ చేసిన చివరికి గుర్తింపు ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. కనీసం పార్టీలో సభ్యత్వం లేని వ్యక్తికి టికెట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏనాడూ పార్టీ కోసం పని చేసింది లేదన్నారు. కావున కోడుమూరు టికెట్ విషయంపై పునర్ పరిశీలన చేయాలని టిడిపి అధినేత చంద్రబాబుకు ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో తన భార్య, పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు కూడా వెనుకాడనన్నారు. అవసరమైతే కోడుమూరులో టిడిపి బూత్ కమిటీ లెవెల్ నుంచి.. ఉన్నత స్థాయి వరకు నేతలు కార్యకర్తలు రాజీనామా చేసి నిరసన తెలిపేందుకు సిద్ధమవుతామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement