Monday, April 29, 2024

Ind vs Eng 1st Day : భార‌త్ ధ‌నాధ‌న్ బ్యాటింగ్.. వికెట్ న‌ష్టానికి 119 ప‌రుగులు

ఉప్పల్‌: హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో మొద‌టిరోజు ఆట ముగిసే స‌మ‌యానికి 246 ప‌రుగుల‌కు ఇంగ్లండ్ జ‌ట్టు ఆలౌట్ కాగా, ఆ త‌ర్వాత బ్యాటింగ్ చేప‌ట్టిన భార‌త్ జ‌ట్టు ఒక వికెట్ న‌ష్టానికి 119 ప‌రుగులు చేసింది.

భారత్‌ వికెట్‌ నష్టానికి 119 పరుగులు (23 ఓవర్లు) చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (24) పరుగులు చేసి ఔటయ్యాడు. యశస్వి (75) అర్ధశతకం చేయగా, శుభ్‌మన్‌ గిల్‌ (14) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్న ఇంగ్లాండ్‌.. 246 పరుగులకు ఆలౌట్‌ అయింది. బెన్‌ స్టోక్స్ (70) అర్ధశతకంతో రాణించాడు. జానీ బెయిర్‌స్టో (37), బెన్ డకెట్ (35) పరుగులు చేశారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 3, అశ్విన్‌ 3, అక్షర్‌ పటేల్‌ 2, బుమ్రా 2 వికెట్‌ తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement