Wednesday, May 15, 2024

ICC | శ్రీలంక క్రికెట్ బోర్డ్‌కు గుడ్‌న్యూస్‌..

శ్రీలంక క్రికెట్‌కు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) శుభవార్త చెప్పింది. గతేడాది నవంబర్‌లో శ్రీలంక క్రికెట్‌ పై విధించిన నిషేధాన్ని తాజాగా ఐసీసీ ఎత్తివేసింది. ఈ మేరకు శ్రీలంక క్రీడా శాఖ మంత్రి హరిన్‌ ఫెర్నాండో ట్వీట్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.

గతేడాది వన్డే వరల్డ్‌ కప్‌లో లంక దారుణ వైఫల్యం నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం ఎస్‌ఎల్‌సీ బోర్డు సభ్యులపై వేటు వేసింది. క్రికెట్‌ బోర్డులో ప్రభుత్వ జోక్యంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఐసీసీ.. శ్రీలంక క్రికెట్ బోర్డ్‌పై నిషేధం విధించింది. దీంతో, ఈ ఏడాది ఐసీసీ అండర్‌ – 19 వరల్డ్‌ కప్‌ ఆతిథ్య హక్కులను కోల్పోయింది శ్రీలంక. ఆ కారణంగా అండర్‌‌19 వరల్డ్‌కప్ సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement