Sunday, May 5, 2024

పృథ్వీ షాకు బాంబే హై కోర్టు నోటీస్‌

ముంబై : భారత క్రికెటర్‌ పృథ్వీ షాకు బాంబే హై కోర్టు నోటీస్‌ జారీ చేసింది. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ సోషల్‌ మీడియా ఇన్‌ప్లుయేన్సర్‌ సప్నా గిల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించాలని కోరుతూ , ఆయనతో పాటు సిటీ పోలీస్‌లకు కూడా కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి లో ముంబై సబర్బన్‌లో ఉన్న ఒక హోటల్లో సెల్ఫీలు తీసుకునే విషయంలో గిల్‌ ఆమె స్నేహితులకు, పృథ్వీ షా అయన స్నేహితులకు మధ్య వివాదం ఏర్పడింది. ఈ విషయంలో గిల్‌ పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఆమె పృథ్వీ షా పై కౌంటర్‌ ఫిర్యాదు దాఖలు చేశారు. తనపై ఉన్న ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని గిల్‌ వేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు ఎస్‌బీ శుక్రే, ఎంఎం సతయేలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ షాతో పాటు పోలీ స్‌లకు నోటీసులు జారీ చేసి కేసును జూన్‌కు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement