Sunday, April 28, 2024

WPL | దంచికొట్టిన గుజరాత్ టాపార్డ‌ర్.. ముంబై టార్గెట్ ఎంతంటే !

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో భాగంగా జరుగుతున్న కీలక మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ టాపార్డర్ రెచ్చిపోయి ఆడింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఆ జట్టు కెప్టెన్ బెత్ మూనీ (66), దయాళన్ హేమలత (74) తో చలరేగారు. భారతి ఫుల్మాలి (13 బంతుల్లో 21 పరుగులు నాటౌట్) ఆకట్టుకుంది. దీంతో గుజరాత్ స్కోరు భారీగా నమోదైంది.

ఇక ముంబై బౌలర్లలో సైకా ఇషాక్ 2 వికెట్లు తీయగా.. హేలీ క్రిస్టెన్ మాథ్యూస్, షబ్నిమ్ ఇస్మాయిల్, పూజా వస్త్రాకర్, సజీవన్ సజన చెరో వికెట్ సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement