Monday, May 13, 2024

విరాట్ కోహ్లీతో భేటీ అయిన గంగూలీ, జైషా…

బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, సెక్రటరీ జైషా టీమిండియా కెఫ్టెన్ విరాట్ కోహ్లీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్‌పై చర్చించినట్లు తెలుస్తోంది. కోహ్లీ సారథ్యంలోని…. టీమిండియా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే ప్రపంచకప్, 2021 టెస్ట్ వరల్డ్ ఛాంపియన్ షిప్ ఓడిపోయింది. దీంతో రాబోయే ఐసీసీ ట్రోఫీలను కచ్చితంగా గెలవాల్సినా వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది. టీ-20 ప్రపంచకప్‌కు జట్టు కూర్పుపై కుడా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అయితే ఈ ఏడాది బీసీసీఐ నిర్వహిస్తున్న టీ-20 ప్రపంచకప్‌ వేదికను కరోనా కారణంగా యూఏఈ కి మార్చిన విషయం తెలిసిందే. కాగా నేటి నుంచి ఇంగ్లాండుతో లీడ్స్ వేదికగా టీమిండియా మూడవ టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్పటికే తొలి టెస్ట్ డ్రా కాగా రెండవ టెస్ట్ కోహ్లీ టీమ్ గెలుచుకుంది. ఇక ఈ మూడవ టెస్ట్ లో గెలిచి సిరీస్ పై పట్టు బిగించాలని చూస్తోంది టీమిండియా. అటు ఇంగ్లండ్ ఈ మ్యాచ్ లో గెలవాలంటే కష్టపడాల్సిందే.

ఇది కూడా చదవండి: చీర కట్టులో పీవీ సింధు

Advertisement

తాజా వార్తలు

Advertisement