Saturday, April 27, 2024

పాక్ పై టీ 20 సిరీస్ కూడా కైవసం చేసుకున్న ఇంగ్లండ్..

పాకిస్థాన్‌తో వన్డే సిరీస్ గెలిచిన ఇంగ్లండ్ ఇప్పుడు టీ 20 సిరీస్ ను కూడా కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్ ల ఈ పొట్టి సిరీస్ను 2-1 తేడాతో ఇంగ్లండ్ కైవ‌సం చేసుకుంది. చివ‌రి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి 154 ర‌న్స్ చేయగా…ఇంగ్లండ్ టార్గెట్ ను ఛేజ్ చేసి ఉత్కంఠ విజ‌యాన్ని న‌మోదు చేసింది. 155 ర‌న్స్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఇంగ్లండ్ తొలుత పూర్తి ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. అయితే 64 ర‌న్స్ చేసిన జేస‌న్ రాయ్ ఔట్ అయిన త‌ర్వాత మ్యాచ్ ఇంగ్లండ్ ప‌ట్టు జారింది. ఆ స‌మ‌యంలో పాక్ స్పిన్న‌ర్లు వ‌ణికించారు. చివ‌ర్లో మోర్గాన్ కీల‌క‌మైన 21 ర‌న్స్ చేశాడు. చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు వెళ్లిన మ్యాచ్‌లో జోర్డ‌న్ విన్నింగ్ షాట్ కొట్టాడు. పాక్ జ‌ట్టులో రిజ్వాన్ 76 ర‌న్స్ చేశాడు. ర‌షీద్‌కు నాలుగు వికెట్లు ద‌క్కాయి.

ఇది కూడా చదవండి: తప్పిన ప్రమాదం..రన్నింగ్ లోనే ఊడిన బస్సు వెనక టైర్..

Advertisement

తాజా వార్తలు

Advertisement