Wednesday, May 15, 2024

ఐపిఎల్ – తొలి ఓవ‌ర్ లో పృథ్వీ షా, రెండో ఓవ‌ర్లో మార్ష్ ఔట్

బెంగుళూరు- ఐపీఎల్ 16 వ సీజన్లో నేడు ఆర్ సి బి తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడింది.. ఈ మ్యాచ్ లో డిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.. నిర్ధారిత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు న‌ష్ట‌పోయి 174 ప‌రుగులు చేసింది. దీంతో ఢిల్లీ గెల‌వాలంటే 175 ప‌రుగులు చేయాల్సివుంది.. ఓపెనర్లుగా బ‌రిలోకి వార్న‌ర్, పృథ్వీ షాలు దిగారు.. అయితే తొలి ఓవ‌ర్ నాలుగో బంతికి పృథ్వీ ర‌నౌట్ అయ్యాడు.. రావ‌త్ వేసిన అద్భుత త్రోకి పృథ్వీ ప‌రుగులేమి చేయ‌కుండా వెనుతిరిగాడు.. ఆ త‌ర్వాత వ‌న్ డౌన్ వ‌చ్చిన మార్ష్ ను పార్నెల్ ఔట్ చేశాడు.. ఢిల్లీ క్యాపిట‌ల్స్ రెండు ఓవ‌ర్లు ముగిసేనాటికి రెండు వికెట్ ల నష్టానికి 2 ప‌రుగులు చేసింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement