Monday, April 29, 2024

Cricket – య‌శ‌స్వీ జైశ్వాల్ ధ‌నాధ‌న్ బ్యాటింగ్ …. భారీ ఆధీక్యం దిశ‌గా భార‌త్ ..

రాజ్‌కోట్ టెస్టులో టీమిండియా భారీ ఆధిక్యంపై క‌న్నేసింది. మూడో రోజు ఇంగ్లండ్‌ను 329 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేసిన భార‌త్.. అనంత‌రం రెండో ఇన్నింగ్స్‌ ధాటిగా మొద‌లెట్టింది. అయితే.. జో రూట్ బౌలింగ్‌లో ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ‌(30) ఎల్బీగా ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన శుభ్‌మ‌న్ గిల్ , య‌శ‌స్వీ జైస్వాల్ లు జాగ్రత్త‌గా ఆడుతున్నారు. ఈ క్ర‌మంలో య‌శ‌స్వీ అర్ధ‌శ‌తకం పూర్తి చేసుకున్నాడు…. ఇందులో మూడు సిక్స్ లు,అయిదు ఫోర్లు ఉన్నాయి… ప్ర‌స్తుతం య‌శ‌స్వీ 79 , గిల్ 26 ప‌రుగుల‌తో క్రీజ్ లో ఉన్నారు.. ప్ర‌స్తుతం భార‌త్ వికెట్ న‌ష్టానికి 129 ర‌న్స్ చేసింది.

ఓవ‌ర్‌నైట్ స్కోర్ 207/ 2 తో మూడో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ 319 ప‌రుగుల‌కే ఆలౌట‌య్యింది. లంచ్ త‌ర్వాత‌ భార‌త బౌల‌ర్లు చెల‌రేగ‌డంతో ట‌ప‌ట‌పా వికెట్లు కోల్పోయింది. పేస‌ర్ సిరాజ్ నాలుగు వికెట్ల‌తో ఇంగ్లండ్ ప‌త‌నాన్ని శాసించాడు. దాంతో, టీమిండియాకు 126 పరుగుల ఆధిక్యం ల‌భించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement