Monday, April 29, 2024

Cricket | టెస్ట్‌ల్లో హిట్‌మ్యాన్ సెంచ‌రీ.. టాప్ టెన్ ర్యాంకింగ్స్‌లోకి రోహిత్‌శ‌ర్మ‌

ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ టాప్ టెన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న టెస్ట్ సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో రోహిత్ త‌న‌ 10వ టెస్ట్ సెంచరీతో తిరిగా మళ్లీ టాప్ టెన్‌లోకి వ‌చ్చేసాడు. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో రోహిత్ 10వ స్థానంలో నిలిచాడు.

ఇదిలా ఉండ‌గా.. భారత జ‌ట్టు త‌రుఫున‌ ఓపెనర్ గా ఎంట్రీ ఇచ్చిన యువ ఆట‌గాడు యశస్వి జైస్వాల్ తన డెబ్యూ మ్యాచ్ టెస్టులో సెంచరీ ప్రదర్శనతో తొలిసారిగా టెస్టు ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. ఈ ర్యాంకింగ్స్‌లో జైస్వాల్ 73వ స్థానంలో నిలిచాడు. కాగా, రిషబ్ పంత్, విరాట్ కోహ్లి టాప్ 20 ర్యాంక్‌లో ఉన్నారు.

- Advertisement -

ఇక ఇదే సిరీస్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ 12 వికెట్లు పడగొట్టి మ‌రో సారి మొదటి స్థానంలో నిలిచాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 5 వికెట్లు పడగొట్టిన రవీంద్ర జడేజా మూడు స్థానాలు ఎగబాకి ఏడో స్థానానికి చేరుకున్నాడు. అలాగే., టెస్టు జట్ల ర్యాంకింగ్స్‌లో భారత్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఇక‌ ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా మొదటి స్థానంలో ఉండ‌గా.. రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో నిలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement