Thursday, May 2, 2024

AP: మ‌ళ్లీ ఉమ్మ‌డి రాజ‌ధానా ? జ‌గ‌న్ ను దులిపేసిన ష‌ర్మిల…

అమ‌రావ‌తి – ఉమ్మడి రాజధాని మరో రెండేళ్లు కావాలని అడుగుతున్నారంటే… ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమినట్లా ? మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా ? అంటూ వైఎస్ఆర్ సీపీని నిల‌దీశారు ఏపీపీసీసీ చీఫ్ ష‌ర్మిల.. ఈ మేర‌కు ఆమె గురువారం ట్విట్ చేశారు.. 5ఏళ్లు అధికారం ఇస్తే విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు కాలేద‌ని ఫైర్ అయ్యారు.. రాష్ట్రానికి రాజధాని లేద‌ని, ప్రత్యేక హోదా రాలేద‌ని ఎత్తి పొడిచారు… ప్రత్యేక ప్యాకేజీలు లేవ‌ని,. పోలవరం పూర్తి కాలేద‌ని అంటూ కనీసం జలయజ్ఞం పెండింగ్ ప్రాజెక్టులకు దిక్కులేద‌ని ధ్వ‌జ‌మెత్తారు…


కొత్త పరిశ్రమలు లేవ‌ని,. ఉన్నవి ఉంటాయో లేదో తెలియద‌న్నారు.. రూ.8లక్షల కోట్ల అప్పులు చేసి అప్పులాంధ్ర ప్రదేశ్ చేశారే తప్పా… అభివృద్ధి చూపలేద‌ని జ‌గ‌న్ ను నిల‌దీశారు… మోడీకి మోకరిల్లి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారే కానీ విభజన హామీలపై ఏనాడూ నోరు విప్పలేద‌ని అన్న జ‌గ‌న్ పై మండిప‌డ్డారు ష‌ర్మిల ..


ఆంధ్రుల రాజధాని ఎక్కడా అని అడిగితే 10ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్ వైపు చూపించే దయనీయ పరిస్థితి వ‌చ్చిందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు… చంద్రబాబు అమరావతి పేరుతో చూపించింది 3D గ్రాఫిక్స్ అయితే… మూడు రాజధానుల పేరుతో జగనన్న ఆడింది మూడు ముక్కలాట అంటూ వ్యాఖ్యానించారు..

- Advertisement -


పూటకో మాట, రోజుకో వేషం వేసే వైసీపీ నేతల వైఫల్యాలను కప్పిపుచ్చుకునే కుట్రలో భాగమే ఉమ్మడి రాజధాని అంశమ‌ని తేల్చి చెప్పారు.. ఓటమి ఖాయమని తెలిసిన జ‌గ‌న్ అన్న ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం తప్పా వైసీపీకి రాజధానిపై, రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ది లేద‌ని అన్నారు ష‌ర్మిల.

Advertisement

తాజా వార్తలు

Advertisement