Friday, April 26, 2024

Breaking: కాన్పూర్ టెస్ట్ మ్యాచ్ డ్రా.. కివీస్ 165/9

న్యూజిలాండ్‌తో జ‌రిగిన టెస్ట్ మ్యాచ్‌లో విజ‌యం అంచున భార‌త్ నిలిచింది. కానీ, మ‌రో వికెట్ తీసి ఉండే బాగుండేది. ఈ క్ర‌మంలో అయిదో రోజు కంప్లీట్ కావ‌డంతో మ్యాచ్‌ను డ్రాగా ప్ర‌క‌టించారు. ఈ మ్యాచ్‌లో కొత్త ప్లేయ‌ర్ అక్ష‌ర్ ప‌టేల్, అశ్విన్, జడేజీ అద్భ‌త ప్ర‌ద‌ర్శ‌న చేశారు.

మొదటి టెస్ట్ మ్యాచ్ లో 284 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టులో ఓపెనర్ టామ్ లాథమ్ (52)మినహా ఎవరు అంతగా రాణించ‌లేదు. భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు, రవీంద్ర జడేజా 4 వికెట్లు, అక్ష‌ర్‌, ఉమేశ్ త‌లా వికెట్ ప‌డ‌గొట్టారు. అయితే గెలుపు కోసం కాకున్నా మ్యాచ్ ని డ్రా చేయడానికి కివీస్ ఆటగాళ్ళు తీవ్రంగా ప్ర‌య‌త్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement