Saturday, May 4, 2024

BCCI | ఐపీఎల్ అభిమానుల కోసం 50 ఫ్యాన్ పార్కులు..

క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ ఈ నెల 22న ప్రారంభం కానుంది. ఈ తరుణంలో క్రికెట్ లవర్స్‌కు బీసీసీఐ శుభవార్త అందించింది. ఐపీఎల్ సీజన్-17 కోసం దేశవ్యాప్తంగా 50 ఫ్యాన్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

ఈనెల 22న మధురైలో తొలి ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. మొదటి రెండు వారాలకు దేశంలోని 11 రాష్ట్రాలను ఫ్యాన్ పార్కులకు వేదికలుగా ఎంపిక చేయగా, ఆ జాబితాలో తెలంగాణ ఉండగా, ఆంధ్రప్రదేశ్ మాత్రం చోటు దక్కలేదు. ఈనెల 30, 31 తేదీల్లో నిజామాబాద్‌లో ఫ్యాన్‌ పార్క్‌ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.

ఇదిలా ఉంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుండగా, జట్లు ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement