Friday, April 26, 2024

హాకీ టెస్ట్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా విజయం.. భారత ఆటగాడు ఆకాశ్‌ దీప్‌ సింగ్‌ శ్రమ వృధా

ఆస్ట్రేలియాతో జరుగుతున్న హాకీ టెస్ట్‌ సిరీస్‌ను భారత్‌ ఓటమితో ఆరంభించింది. ఆడిలైడ్‌లో శనివారం హోరాహోరీగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 4-5 గోల్స్‌తో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఇండియా ఫార్వర్డ్‌ ప్లేయర్‌ ఆకాశ్‌ దీప్‌ సింగ్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌ నమోదు చేశాడు. కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ సింగ్‌ ఒక గోల్‌ కొట్టాడు. అయితే ఆస్ట్రేలియా ఆటగాడు బ్లేక్‌ గ్రోవర్స్‌ 60 వ నిమిషంలో పెనాల్టి కార్నర్‌ను గోల్‌గా మార్చాడు. దాంతో ఆస్ట్రేలియా 5-4 గోల్స్‌తో విజేతగా నిలిచింది.

ఆకాశ్‌ దీప్‌ మ్యాచ్‌ ఆరంభమైన 9వ నిమిషంలో తొలి గోల్‌ కొట్టాడు. ఆ తర్వాత 26వ, 58 వ నిమిషంలో మరో రెండు గోల్స్‌ కొట్టి హ్యాట్రిక్‌ సాధించాడు. దాంతో ఇరు జట్ల స్కోర్‌ 4-4తో సమం అయింది. దాంతో మ్యాచ్‌ డ్రాగా ముగుస్తుంది అనిపించింది. కానీ 60 వ నిమిషంలో లభించిన పెనాల్టి కార్నర్‌ను ఆస్ట్రేలియా సద్వినియోగం చేసుకుంది. దాంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0తో ఆధిక్యంలో దూసుకెళ్లింది. భారత్‌ ఆస్ట్రేలియా జట్లు ఈ ఏడాది బర్మింగ్‌ హామ్‌లో జరిగిన కామన్‌ వెల్త్‌ ఫైనల్‌ తర్వాత మళ్లిd తలపడడం ఇదే మొదటిసారి. ఫైనల్లో ఆస్ట్రేలియా 7-0తో భారత్‌ను చిత్తు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement