Thursday, May 9, 2024

Cricket | ఆఫ్గాన్ టీమ్‌ మెంటర్‌గా అజయ్‌ జడేజా

టీమిండియా మాజీ క్రికెటర్‌ అజయ్‌ జడేజా ఆఫ్గనిస్తాన్‌ పురుషుల క్రికెట్‌ టీమ్‌ మెంటర్‌గా నియమితులయ్యారు. జడేజాతో ఆఫ్గాన్​ క్రికెట్‌ బోర్డు ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఆ దేశ క్రికెట్‌ బోర్డు సోమవారం వెల్లఢించింది. అక్టోబర్‌ 5వ తేదీ నుంచి భారత్‌ వేదికగా ప్రారంభం కానున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ నుంచి జడేజా తన మెంటర్‌ ప్రస్థానాన్ని మొదలు పెట్టనున్నారు.

వరల్డ్‌కప్‌లో అక్బోబర్‌ 7వ తేదీన జరిగే తమ తొలి మ్యాచ్‌లో ఆఫ్గనిస్తాన్‌ జట్టు బంగ్లాదేశ్‌తో తలపడనుంది. తర్వాత అక్టోబర్‌ 11న టీమిండియాతో ఢీ కొననుంది. 52 ఏళ్ల అజయ్‌ జడేజా భారత్‌ తరఫున 15 టెస్టులు, 196 వన్డే మ్యాచ్‌లు ఆడారు. టెస్టుల్లో పెద్దగా ఆడని జడేజా వన్డేల్లో మాత్రం దూకుడైన బ్యాట్స్‌మన్‌గా పేరుసంపాదించారు. వన్డేల్లో 6 శతకాలు, 30 అర్ధ శతకాలతో మొత్తం 5359 పరుగులు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement