Monday, May 6, 2024

రైలు ప్రమాదంలో మొసలి మృతి.. పట్టాలు దాటుతుండగా దుర్ఘటన

కర్ణాటక : రైలు ప్రమాదంలో ఒక మొసలి చనిపోయిన ఘటన గడగ్‌ జిల్లాలోని హలే ఆలూరు గ్రామంలో సోమవారం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. మలప్రభ నది నుంచి వెలుపలకు వచ్చిన ఎనిమిది అడుగుల మొసలి పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని రెండు ముక్కలైపోయిందని చెప్పారు. పట్టాల పక్కన పడి ఉన్న మొసలిని చూసిన స్థానికులు అధికారులు తెలియపరిచారు. కేసు నమోదు చేసిన అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement