Sunday, April 28, 2024

జాతీయ క్రీడ‌ల్లో స్వ‌ర్ణం సాధించిన ఏపీ అథ్లెట్ జ్యోతి య‌ర్రాజి-అభినందించిన మంత్రి రోజా

జాతీయ క్రీడ‌ల్లో స్వ‌ర్ణం సాధించింది ఏపీ అథ్లెట్ జ్యోతి య‌ర్రాజి. గుజ‌రాత్ లో 36వ జాతీయ క్రీడ‌లు జ‌రుగుతున్నాయి.కాగా జ్యోతి యర్రాజి 100 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించింది. మహిళల 100 మీటర్ల రేసు ఫైనల్లో జ్యోతి 11.51 సెకన్ల టైమింగ్ నమోదు చేసి ప్రథమస్థానంలో నిలిచింది. రెండోస్థానంలో తమిళనాడుకు చెందిన అర్చన సుశీంద్రన్ (11.55 సెకన్లు), మహారాష్ట్రకు చెందిన డయాండ్రా (11.62 సెకన్లు) మూడో స్థానంలో నిలిచారు. మహిళల 100మీ స్ప్రింట్ లో గోల్డ్ మెడల్ చేజిక్కించుకున్న జ్యోతి యర్రాజిని ఏపీ క్రీడల మంత్రి రోజా, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, శాప్ ఎండీ ఎన్.ప్రభాకర రెడ్డి అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement