Thursday, May 9, 2024

తొలిరోజే ముగిసిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్

అహ్మదాబాద్ మొతేరా స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో తొలిరోజే ఇంగ్లండ్ ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లీష్ టీమ్ 205 పరుగులకు ఆలౌటైంది. ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ 55 పరుగులతో రాణించగా డి.లారెన్స్ (46), పోప్ (29) కాసేపు పోరాడారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 4, రవిచంద్రన్ అశ్విన్ 3, మహ్మద్ సిరాజ్ 2 వికెట్లు సాధించగా వాషింగ్టన్ సుందర్ ఓ వికెట్ తీశాడు. కాగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఓ వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది. గిల్ డకౌట్ అయ్యాడు. అతడి వికెట్‌ను అండర్సన్ దక్కించుకున్నాడు. కాగా కనీసం ఈ టెస్టు డ్రాగా ముగిసినా టీమిండియా ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement