Friday, April 26, 2024

ఉద్యోగాలను బిచ్చమేస్తున్నారా?.. కేసీఆర్ ట్రాప్ లో పడకండి: షర్మిల

నిరుద్యోగులను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కేసీఆర్ ట్రాప్ లో పడొద్దని ఆమె కోరారు. 56 పోస్టు కాదు.. లక్ష 91 వేల ఉద్యోగాలే కాకుండా కొత్త జిల్లాల ప్రకారం అవసరమైన ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. మీడియా మిత్రులు నిరుద్యోగుల ఆశలను చంపవద్దని విజ్ఞప్తి చేశారు. లక్ష 91 ఖాళీలను భర్తీ  చేయడంలో నిరుద్ఓగుల పక్షాన నిలబడాలని కోరారు. నిరుద్యోగులకు మీరు ఉద్యోగాలను బిచ్చమేస్తున్నారా లేక దానం చేస్తున్నారా కేసీఆర్ గారూ? అని షర్మిల ప్రశ్నించారు. లేక మీ పార్టీ నేతలకు పదవులను బిస్కెట్ వేసినట్టు ఇస్తున్నారా? అని అడిగారు. ఈరోజు కాంట్రాక్టు ఉద్యోగాలతో నెట్టుకొస్తానంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను పర్మినెంట్ గా భర్తీ చేయాల్సిందేనని షర్మిల డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement