Sunday, May 5, 2024

డోన్ లో అక్కాచెల్లెళ్ల ఆమరణ నిరాహార దీక్ష

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా డోన్ లో అక్కాచెల్లెళ్లు ధర్నాకు దిగారు. కన్న తండ్రి, చిన్నాన్న తమను వేధిస్తున్నారంటూ ఎమ్మార్వో ఆఫీసు ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. తమకు న్యాయం చేయాలని అక్కాచెల్లెళ్లు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తాము చావడానికైనా సిద్ధంగా ఉన్నామంటూ తెలిపారు. తల్లి చనిపోతే తమ తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిపారు. అప్పటి నుంచి రోజూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement