Wednesday, May 8, 2024

బాబు తుప్పు… లోకేష్ పప్పు :విజయసాయిరెడ్డి

ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో ఫ్యాన్ విజయ కేతనం ఎగుర వేస్తుంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా టిడిపి నాయకుల పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయాక ఈవీఎంలు వద్దు బ్యాలెట్ ఓట్లు కావాలన్నాడు. ఈ ఎన్నికల్లో ఓడిపోయాక బ్యాలెట్ వద్దు ఈవీఎంలు కావాలంటాడెమో. పప్పు ఎండ్ తుప్పు ఒకరినొకరు ఓదార్చుకునేందుకు పక్క రాష్ట్రం హైదరాబాద్ లో ఒకే ఇంట్లో ఉన్నారట.

ఎన్నికల ఫలితాల రోజు కూడా నువ్వు నీ కొడుకు పొరుగు రాష్ట్రంలోని హైదరాబాద్ లో ఇంట్లో నుంచి కదలలేదంటే ప్రజాస్వామ్యం మీద నీ ఆత్మ విశ్వాసం చాలా గొప్పది చంద్రబాబు…అంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. మరి విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ కు టిడిపి నేతలు ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement