Friday, May 3, 2024

జగన్ వైపు కన్నెత్తి చూసినా లోకేష్ తాట తీస్తాం: జోగి రమేష్

టీడీపీ నేత నారా లోకేష్‌పై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ వైపు కన్నెత్తి చూసినా.. లోకేష్ తాట తీస్తామని హెచ్చరించారు. ఒక అడుగు వేస్తే తాటి మట్టలతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని, ఇది ఆరంభం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నాయని జోగి రమేష్ మండిపడ్డారు. ఇటువంటి వ్యక్తులను చంద్రబాబు ప్రోత్సాహిస్తున్నాడా అంటూ నిలదీశారు. శాంతియుతంగా చంద్రబాబుకు నిరసన చెప్పటానికి వెళితే తనపై దాడి చేశారని… చంద్రబాబు నోటిని ఫినాయిల్‌తో కడగాలని నిప్పులు చెరిగారు. టీడీపీ నేతలు పద్ధతి మార్చుకోకపోతే చంద్రబాబును రాష్ట్రంలో తిరుగనివ్వమని జోగి రమేష్ హెచ్చరించారు‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement