Friday, April 19, 2024

ప్రధాని మోదీకి బర్త్ గిఫ్ట్.. 2 కోట్ల టీకాలు పంపిణీ

కరోనా కట్టడికి దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పెరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం రెండు కోట్ల డోసుల టీకా అందించి రికార్డు సృష్టించారు. కరోనా టీకా వేయించుకొని ప్రధాని మోదీకి కానుక ఇవ్వాలని బీజేపీ నేతలు ఇచ్చిన పిలుపుకు భారీ స్పందన వచ్చింది. దేశంలో కోవిడ్ టీకా తీసుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ కేంద్రాలకు తరలివచ్చారు. దీంతో అనుకున్న దానికంటే ఎక్కువ స్పందన లభించింది. శుక్రవారం రెండు కోట్ల వ్యాక్సినేషన్లు జరగడంతో.. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు టీకా తీసుకున్న వారి సంఖ్య 75 కోట్లకు చేరింది. గాంధీ జయంతి (అక్టోబర్ 2) వరకు  ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వంద కోట్లకు చేరుకుంటుందని అధికారులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఆ పథకాలతో గిరిజనులకు జీవితాల్లో వెలుగులు

Advertisement

తాజా వార్తలు

Advertisement