Friday, April 26, 2024

సీఎం జగన్‌కు షాక్.. టీడీపీలో చేరనున్న వైసీపీ కీలక నేత

వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌కు షాక్ తగలనుంది. ఆయన సన్నిహితుడు, కడప జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. జగన్ పాదయాత్ర సమయంలో పార్టీకి కీలకంగా సహకారం అందించిన వైసీపీ నేత మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఆయన టీడీపీ చీఫ్ చంద్రబాబును కూడా కలిశారు. ఈ సందర్భంగా కడప జిల్లాతో పాటు రాయచోటిలోని రాజకీయ పరిస్థితులపై చంద్రబాబుతో ఆయన చర్చించినట్లు తెలుస్తోంది.

కాగా జగన్ పాదయాత్ర సమయంలో రాంప్రసాద్‌రెడ్డి కీలకంగా వ్యవహరించగా ప్రస్తుతం ఆయన పార్టీని వీడటం వల్ల స్థానికంగా వైసీపీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ బలోపేతం కోసం ప్లాన్ చేయాలని రాంప్రసాద్‌రెడ్డికి చంద్రబాబుకు సూచించినట్లు తెలుస్తోంది. కాగా స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డితో ఉన్న గొడవల వల్లే రాంప్రసాద్‌రెడ్డి వైసీపీని వీడుతున్నట్లు తెలుస్తోంది.

ఈ వార్త కూడా చదవండి: చిత్తూరు జిల్లాలో అతిపెద్ద ‘హీరో’ లోగో

Advertisement

తాజా వార్తలు

Advertisement