Thursday, April 25, 2024

చిత్తూరు జిల్లాలో అతిపెద్ద లోగో.. ‘హీరో’ గిన్నిస్ రికార్డు

ఒకప్పుడు హీరో హోండా కంపెనీ మోటార్ కార్పొరేషన్ ఇండస్ట్రీని లీడ్ చేసింది. ఈ మేరకు హోండా కంపెనీతో కలిసి హీరో సంస్థ బైకులను ఉత్పత్తి చేసింది. అయితే కొన్ని విభేదాల కారణంగా హోండా మధ్యలో విడిపోయింది. అలా విడిపోయి దశాబ్దం గడిచింది. ఈ సందర్భంగా హీరో సంస్థ ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.

ప్రపంచంలోనే అతిపెద్ద లోగోను సృష్టించి గిన్నిస్ రికార్డును నెలకొల్పింది. అందుకు ‘స్ప్లెండర్ ప్లస్’ బైకులను వాడుకుంది. ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఉన్న పరిశ్రమను ఆ రికార్డుకు వేదిక చేసుకుంది. 1000/800 స్థలంలో 1,845 బైకులను వరుస క్రమంలో పేర్చి రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఫీట్ కోసం దాదాపు 90 రోజుల పాటు సంస్థ ప్రణాళికలు వేసింది. 300 గంటల పాటు సిబ్బంది పనిచేసినట్లు తెలుస్తోంది.

ఈ వార్త కూడా చదవండి: ప్రశ్నిస్తే ఉద్యోగాలు తీసేస్తారా..?: కేసీఆర్ పై షర్మిల ఆగ్రహం

Advertisement

తాజా వార్తలు

Advertisement