Saturday, May 4, 2024

WTC Final – ఓవ‌ల్ లో రికార్డుల మోత‌….

ఓవల్‌లో టీమిండియా 14 టెస్టులు ఆడింది. కేవలం రెండింటిలో మాత్రమే గెలి చింది. ఐదు టెస్టులో ఓడిం ది. 7 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. 1936లో జరిగిన తొలిటె స్టులో 9 వికెట్ల తేడాతో ఇంగ్లం డ్‌పై ఓడిపో యింది. చివరకు 1971లో మొదటి విజ యాన్ని నమో దు చేసింది. మూడో టెస్టులో 4 వికెట్లతో భారత్‌ గెలు పొందింది. అతర్వాత మళ్లి 2021లో కోహ్లీ సారథ్యం లోని యువ భారత్‌ ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది.

ఈ వేదికపై అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌ గా రాహుల్‌ ద్రవిడ్‌ పేరిట రికార్డు ఉంది. అతను 443 పరుగులు చేశాడు. ఆ తర్వాత సచిన్‌ టెండూల్కర్‌(272 రన్స్‌), రవి శాస్త్రి(253 పరుగులు) వరుసగా రెండు, 3 స్థానాల్లో ఉన్నారు. ఈ వేదికపై జడేజా అత్య ధికంగా 11 వికెట్లు తీశాడు. కపిల్‌ దేవ్‌ 10, భగవత్‌ చంద్రశేఖర్‌ 8 వికెట్లు పడగొ ట్టారు.

ఈ మైదానంలో ఆసీస్‌కు కూడా మంచి రికార్డు లేదు. ఇప్పటివరకు ఓవల్‌లో కంగా రూలు 38 టెస్టు మ్యాచ్‌లు ఆడగా, ఏడు మాత్రమే గెలిచారు. 17 టెస్టుల్లో ఓడి, 14 మ్యాచ్‌లను డ్రా చేసుకు న్నారు. ఇక్కడ ఆస్ట్రేలి యా గత 50 ఏళ్లలో రెండుసార్లు (2001, 2015) మాత్రమే గెలుపొందింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement