Monday, April 29, 2024

Manipur : కాల్పులు.. బీఎస్ఎఫ్ జ‌వాన్ మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు

మ‌ణిపూర్‌లో మళ్లీ ఘర్షణ చెలరేగింది. మణిపూర్ లోని సిరౌలో తిరుగుబాటుదారులు దారుణానికి పాల్ప‌డ్డారు. బీఎస్ఎఫ్ జ‌వాన్లు, అసోం రైఫిల్స్ సైన్యంపై కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో ఒక బీఎస్ఎఫ్ జ‌వాను ప్రాణాలు కోల్పోగా, ఇద్ద‌రు అసోం రైఫిల్స్ సైనికుల‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయ‌ప‌డ్డ సైనికుల‌ను మంత్రిపుఖ్రీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ సంద‌ర్భంగా ఇండియ‌న్ ఆర్మీ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

సిరౌ ఏరియాలో తిరుగుబాటుదారుల కార్య‌క్రమాల‌ను అణిచివేసేందుకు నిన్న రాత్రి అసోం రైఫిల్స్, బీఎస్ఎఫ్ జ‌వాన్లు క‌లిసి చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఆ స‌మ‌యంలో తిరుగుబాటుదారులు కాల్పులు జ‌ర‌ప‌డంతో ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్లు తెలిపారు. ఒక జ‌వాను మృతి చెందాడ‌ని, మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని పేర్కొన్నారు. తిరుగుబాటుదారుల ఆచూకీ కోసం ఆ ప్రాంతంలో గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement