Monday, April 29, 2024

బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ‘రైటర్ పద్మభూషణ్’

డైరెక్టర్ షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం లో నటుడు సుహాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ‘రైటర్ పద్మభూషణ్’. ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. కాగా, లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ఈ సినిమా ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది.

- Advertisement -

ఈ మూవీ వచ్చే ఆదివారం, మే 28న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు లో ప్రసారం కానుంది. టీనా శిల్పరాజ్, రోహిణి, ఆశిష్ విద్యార్థి లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కళ్యాణ్ నాయక్, శేఖర్ చంద్ర లు సంగీతం అందించారు. ఛాయ్ బిస్కెట్స్ ఫిల్మ్స్, మరియు లహరి ఫిల్మ్స్ లపై నిర్మించిన ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement