Wednesday, March 27, 2024

Self Justice – బాలికపై అత్యాచారం – నిందితుడిని కొట్టి చంపిన గ్రామస్థులు

కడప – అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో దారుణం చోటుచేసుకుంది.బాలిక (13)పై అత్యాచారం చేసిన నిందితుడిని గ్రామస్థులు కొట్టి చంపారు. పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం టి.పసలవాండ్లపల్లి పంచాయతీ ఉదారవాండ్లపల్లికి చెందిన బాలిక (13)పై అదే గ్రామానికి చెందిన ముత్తన్న(43) అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికపై కత్తితో దాడి చేసి గాయపర్చాడు. . ఆదివారం సాయంత్రం సమీప పొలాల్లో ఆవులు మేపుతుండగా ముత్తన్న ఈ దారుణానికి ఒడిగట్టాడు.ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు మూకుమ్మడిగా నిందితుడిపై దాడికి దిగారు. రాళ్లు, కర్రలతో ఇష్టమొచ్చినట్టు కొట్టడంతో ముత్తన్న అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.

కాగా, తీవ్ర గాయాలు కావడంతో బాలిక ప్రాణాపాయ స్థితిలో ఉంది. స్థానికులు ఆమెను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడు ముత్తన్న గతంలో భార్యను చంపి ఏడేళ్లు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవించాడు. రెండేళ్ల క్రితమే జైలు నుంచి విడుదలయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement