ప్రపంచకప్కు అర్హత సాధించే క్రమంలో ఆదివారం జింబాబ్వేతో జరిగిన కీలక పోరులో లంకేయులు గర్జించారు. సూపర్ సిక్స్ క్వాలిఫయర్ మ్యాచ్లో జింబాబ్వేను 9 వికెట్ల తేడాతో చిత్తుచేశారు. బౌలింగ్లో మహీశ్ తీక్షణ నాలుగు వికెట్లు తీయగా, బ్యాటింగ్ పథుం నిశాంక సెంచరీతో కదంతొక్కి జట్టుకు సునాయాస విజయాన్ని అందించారు. టాస్ నెగ్గిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆఫ్ స్పిన్నర్ తీక్షణ 4-25తో రాణించగా, ఎడమచేతి పేసర్ మధుశంక 3-15తో నిప్పులు చెరగడంతో జింబాబ్వే 165 పరుగులకే చాపచుట్టేసింది.
లక్ష్య ఛేదనలో నిస్సాంక అజేయ సంచరీతో కదం తొక్కాడు. 102 బంతుల్లో 101 పరుగులు చేశాడు. దిముత్ కరుణరత్నె (30), కుశాల్ మెండిస్ (25నాటౌట్) అతడికి సహాయంగా నిలిచారు. దాంతో 101 బంతులు మిగిలివుండగానే శ్రీలంక 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సూపర్సిక్స్ పాయింట్ల పట్టికలో శ్రీలంక అగ్రస్థానంలో నిలిచి, ప్రపంచకప్ టోర్నీలో బెర్తు ఖాయం చేసుకుంది.
సంక్షిప్త స్కోర్లు:
జింబాబ్వే: 165 (135.2 ఓవర్లు) సీన్ విలియమ్స్ 56,సికిందర్ రజా 31. మహీశ్ తీక్షణ 4-25, మధుశన్క 3-15.
శ్రీలంక: 169/1 (33.1ఓవర్లు) నిస్సాంక 101 నాటౌట్, కరుణరత్నె 30. ఎంగర్వ 1-35.