Monday, April 29, 2024

ముగిసిన నామినేష‌న్ల ఉప సంహ‌ర‌ణ.. మునుగోడు బ‌రిలో 47 మంది అభ్య‌ర్థులు

మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల ఉప సంహరణ ప్ర‌క్రియ పూర్త‌య్యింది. మొత్తం 83 మంది అభ్య‌ర్థులు నామినేషన్లు దాఖాలు చేయ‌గా.. అందులో 36 మంది అభ్యర్థులు ఉప సంహరించుకున్నారు. ఉప ఎన్నికల బరిలో ఫైనల్ గా 47 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇందులో ప్ర‌ధానంగా టీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ మ‌ధ్య‌త‌నే పోటీ ఉన్న‌ట్లు తెలుస్తోంది. రాజ‌గోపాల్ రెడ్డి త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్య‌మైంది. అనంత‌రం రాజ‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడి బీజేపీలో చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement