Tuesday, May 7, 2024

ఏ రాజకీయ పార్టీలోనూ చేరను – యశ్వంత్‌సిన్హా

ఏ రాజకీయ పార్టీలోనూ చేరకుండా స్వతంత్య్రంగా ఉంటానని రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ కేంద్రమంత్రి యశ్వంత్‌ సిన్హా ప్రకటించారు. ఇక ముందు ప్రజా జీవితంలో ఏం చేయాలన్న అంశంపై నిర్ణయం తీసుకోలేదని సిన్హా మంగళవారం న్యూఢిల్లిలో ప్రకటించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎవరూ ఇప్పటి వరకు తనకు ఫోన్‌ చేయలేదని అన్నారు. తాను కూడా ఎవరికీ ఫోన్‌ చేయలేదని సిన్హా స్పష్టం చేశారు.

నా వయసు 84 సంవత్సరాలు. పబ్లిక్‌ లైఫ్‌లో ఇప్పుడు చేయగలిగినవి, ఎంత ఉత్సాహంగా ఉన్నాను అనేదానిపై నిర్ణయం తీసుకుంటానని సిన్హా అన్నారు. పశ్చిమబెంగాల్‌ అసెంబ్లి ఎన్నికలకు ముందు మార్చి 2021లో సిన్హా తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement