Sunday, April 28, 2024

Karnataka: ఇన్‌స్టాగ్రాంకు భార్య బానిస‌… భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌…

ప్రస్తుత సమాజంలో సోష‌ల్‌మీడియానుఉపయోగించడంలో చాలా బిజీ అయిపోతున్నారు. గంట‌ల త‌ర‌బ‌డి ఇన్‌స్టాగ్రాం, ఫేక్‌బుక్‌, ట్వీట్ట‌ర్ అంటూ స‌మ‌యాన్ని కేటాయిస్తున్నారు. త‌మ నిత్య‌జీవ‌నంలో వారి ప్ర‌వ‌ర్త‌న‌లో అనేక మార్పుల‌ను చోటుచేసుకుంటున్నాయి. దీంతో కొంతమంది అస‌హ‌నానికి గురిచేస్తున్నాయి. కానీ అది కాస్తా, ఎక్కువ అయితే, మాత్రం తీవ్ర అనర్థాలు ఎదుర్కొవల్సి వస్తుంది. తాజాగా ఇలాంటి ఘ‌ట‌నే క‌ర్ణాట‌క‌లో చోటుచేసుకుంది.

- Advertisement -

కర్ణాటక రాష్ట్రంలో తన పెళ్లం ఇన్‌స్టాగ్రామ్‌కు బానిస అయిందనే ఆవేదనతో భర్త సూసైడ్ చేసుకున్నారు. అయితే, తన భార్య ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ చేయడంపై ఉన్న వ్యామోహంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు భర్త కుమార్ ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెట్టింది.. దీంతో ఇద్దరికీ తరచూ గొడవలు అవుతుండటంతో మనస్తాపం చెందిన భర్త హనురూలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

కాగా, కూలీగా పని చేస్తున్న కుమార్‌కు తన భార్య సోషల్ మీడియాలోనే ఎక్కువ సేపు గడపడంతో పాటు ఇన్ స్టాగ్రామ్ లో ఆమె తరచూ రీల్స్ చేస్తుండేది అని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఆమె పట్టించుకోవడం లేదనే బాధలో అతడు సూసైడ్ చేసుకున్నాడుని పేర్కొన్నారు. అయితే, ఘటనా స్థలం దగ్గర ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని పోలీసులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement