Friday, May 3, 2024

ఏ వేలుతో బొట్టు పెట్టుకోవాలి.. పురాణాలు ఏం చెబుతున్నాయంటే..

హిందూ పురాణాల ప్రకారం మధ్య వేలు శని స్థానం. ఈయన జీవితానికి భద్రత కలిగిస్తాడు. కాబట్టి మధ్యవేలితో నుదుటిపై తిలకం ధరిస్తే దీర్ఘాయుష్షు లభిస్తుంది. ఉంగరపు వేలు సూర్య స్థానం. అందుకే ఈ వేలుతో నుదుటన బొట్టు పెట్టుకుంటే మనశ్శాంతి. అంతేకాదు సూర్యుడి తేజస్సు, శక్తి కలుగుతాయి. అలాగే ఉంగరపు వేలుతో తిలకధారణ చేస్తే నుదుటిపై ఉండే జ్ఞానచక్రం ఉత్తేజితమై, మనిషి మేధస్సును మేల్కొల్పడానికి సహాయపడుతుంది. అందుకే దేవుడికి ఈ వేలుతోనే తిలకధారణ చేస్తారు.

బొటన వేలు శుక్ర స్థానం. ఈ గ్రహం ఆరోగ్యం ప్రసాదిస్తుంది. కాబట్టి బొటనవేలుతో తిలకం దిద్దుకుంటే ఆరోగ్యం, శక్తి కలుగుతాయి. చూపుడు వేలు బృహస్పతి స్థానం. మరణించిన వారికి మాత్రం ఈ వేలుతో తిలకం దిద్దితే మోక్షం ప్రాప్తిస్తుంది.
అమరత్వాన్ని కలిగించేది బృహస్పతి గ్రహం. అందుకే మిగతా సందర్భాల్లో చూపుడువేలుతో నుదుటిపై బొట్టు పెట్టడాన్ని అప విత్రంగా భావిస్తారు. అందుకే ఆ వేలుతో బొట్టు పెట్టగడం, పెట్టు కోవడం చేయకూడదంటారు పెద్దలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement