Thursday, May 2, 2024

దావోస్‌లో సంపన్నుల నిరసన.. స‌దస్పుపై పేట్రియాటిక్ మిలియ‌నీర్స్ గ్రూప్ ఆందోళ‌న‌..

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ శిఖరాగ్ర సమావేశంలో అనూహ్యంగా సంపన్న వర్గాల వారి నుంచి నిరసన వెల్లువెత్తింది. ‘ది పేట్రియాటిక్‌ మిలియనీర్స్‌’ అనే గ్రూప్‌ సభ్యులు ఈ నిరసనకు పూనుకున్నారు. ‘ప్రపంచం అంతా ఆర్థిక సంక్షోభాలలో కూరుకుపోతుంటే… బిలియనీర్లు, ప్రపంచ నేతలు ఇక్కడ సమావేశమై చరిత్ర మలుపులు తిప్పే అంశాలపై చర్చలు జరుపుతున్నారు. దురదృష్టవశాత్తు మన రాజకీయ నాయకులలో చాలా మందికి ఈ ఆర్థిక సంక్షోభం ప్రభావం తీవ్రత గురించి చాలా తక్కువ మాత్రమే తెలుసు. ఈ సమావేశాలు తేల్చే అంశం ఒక్కటే ఉంటుంది. అది… సంపన్నులపై మరిన్ని పన్నులు వేయడమే. ఆ పన్నులేవో ఇప్పుడే వేయండి.. దావోస్‌ 2022కు హాజరవుతున్న ప్రతినిధులపై పన్ను వేయండి’ అని ఈ గ్రూప్‌నకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫిల్‌ వైట్‌ తెలియజేసినట్లు ది గార్డియన్‌ తెలియజేసింది.

ఈ ఏడాది ‘వర్కింగ్‌ టూ గెదర్‌.. రిస్టోరింగ్‌ ట్రస్ట్‌ నినాదంతో ఈ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను తెలుసుకొని, భవిష్యత్తులో రానున్న కష్టకాలం నుంచి బయటపడడానికి విధానాలను ఖరారు చేయడంలో ఈ సమావేశం ప్రపంచ నాయకులకు ఓ అవకాశాన్ని ఇస్తుందన్న ఆశాభావాన్ని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ వ్యక్తం చేసింది. మహమ్మారి నుంచి బయటపడడం, వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కోవడం, మంచి భవిష్యత్తు నిర్మించడం, నాల్గవ పారిశ్రామిక విప్లవానికి మార్గాన్ని సుగమం చేయడం ఈ సమావేశాల ఏజెండాలోని కీలక అంశాలు. అయితే, ఈ చర్చలేవీ ఫలితాలు ఇవ్వవని పేట్రియాటిక్‌ మిలియనీర్స్‌ గ్రూప్‌ అంటున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement