Friday, April 19, 2024

Breaking: ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరులో లారీ బీభ‌త్సం.. ముగ్గురు యువ‌కులు మృతి

ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరులో ఘోరం జ‌రిగింది. కొద్దిసేప‌టి క్రితం ఓ లారీ బీభ‌త్సం సృష్టించింది. ఈ ఘ‌ట‌న‌లో లారీ చ‌క్రాల కింద న‌లిగి ముగ్గురు యువ‌కులు అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారు. గిద్దలూరు పట్టణ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సమయంలో ఓ లారీ వారిపై నుండి వెళ్లిపోయింది. దీంతో ముగ్గురు ద్విచక్ర వాహనదారులు అక్కడికక్కడే మృతి చెందారు. అమరావతి, అనంతపురం జాతీయ రహదారి పై చోటు చేసుకున్న ఈ ఘటనతో వాహనదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జరిగిన ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. మృతులు గిద్దలూరు మండలానికి చెందిన హున్నక్, ప్రవీణ్,నవీన్ గా పోలీసులు గుర్తించారు. మృతులలో క్రిష్టం శెట్టిపల్లి గ్రామానికి చెందిన వారు ఇద్దరు కాగా మరొకరు గిద్దలూరు చెందిన వారిగా పోలీసులు ధ్రువీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement