Saturday, April 27, 2024

విశాఖ న‌గ‌రాన్ని అందంగా తీర్చిదిద్దాలి : సీఎం జ‌గ‌న్‌

విశాఖ న‌గ‌రాన్ని అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా తీర్చిదిద్దాల‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ అన్నారు. గురువారం ఉన్న‌తాధికారుల‌తో సీఎం గ‌జ‌న్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. విశాఖలో ప్రతిష్టాత్మక సదస్సుల ఏర్పాట్లపై వారితో చ‌ర్చించారు. మార్చి 3,4వ తేదీల్లో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సును ఏపీలో నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జీ-20 సన్నాహక సదస్సు ఏర్పాట్లపై చర్చించారు. మార్చి 28,29వ తేదీల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ సమావేశం ఉంటుంద‌న్నారు. విశాఖ ఇలాంటి గొప్ప స‌ద‌స్సుల‌కు వేదిక కావ‌డం మ‌న అదృష్ట‌మ‌ని, విశాఖ‌ను అందంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించించారు. పెట్టుబడుల ఆకర్ష‌ణే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement