Saturday, May 4, 2024

Uttar Pradesh – పోలీసుల ఎన్‌కౌంటర్‌ – వాంటెడ్‌ క్రిమినల్‌ గుఫ్రాన్‌ హతం

ఉత్తరప్రదేశ్‌ లో మరోసారి పోలీసు తుపాకీ పేలింది. డజనుకు పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న వాంటెడ్‌ క్రిమినల్‌ గుఫ్రాన్‌ను పోలీసులు మంగళవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్‌ చేశారు.

అతడి తలపై రూ.1.25లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో యూపీ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం కౌశంబీ జిల్లాలో తనిఖీలు చేపట్టింది. ఆ ప్రాంతంలో గుఫ్రాన్‌ ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అతడిని చుట్టుముట్టారు. ఈ క్రమంలోనే గుఫ్రాన్‌ కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపగా.. అతడు గాయపడ్డాడు. అనంతరం అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతిచెందాడు

Advertisement

తాజా వార్తలు

Advertisement