Monday, April 29, 2024

ఆర్ఎఫ్ సి ఎల్ లో నిలిచిన యూరియా ఉత్పత్తి… ఏడాదిలో నాలుగోసారి

గోదావరిఖని, (ప్రభ న్యూస్) : రామగుండం ఎరువుల కర్మాగారం యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. సాంకేతిక కారణాలతో సోమవారం యూరియా ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ఒకే సంవత్సరంలో నాలుగో సారి యూరియా ఉత్పత్తి సాంకేతిక లోపంతో నిలిచిపోవడంతో అధికారులు తల బాదు కుంటున్నారు. మంగళవారం రోజు కూడా యూరియా ఉత్పత్తి జరిగే అవకాశం లేదని సమాచారం. యూరియా ఉత్పత్తిని పునరుద్దించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement