Friday, April 26, 2024

చెన్నైలో కూర‌గాయ‌లు కొన్న కేంద్ర మంత్రి నిర్మ‌ల‌మ్మ‌.. కామెంట్స్ చేస్తున్న నెటిజ‌న్లు

తమిళ‌నాడు రాజ‌ధాని చెన్నై పర్య‌ట‌న‌కు వ‌చ్చిన బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ శ‌నివారం ఉద‌యం నుంచి రాత్రి దాకా సిటీలో బిజీబిజీగా గ‌డిపారు. త‌న షెడ్యూల్ మేర‌కు అన్ని కార్య‌క్ర‌మాల‌ను ముగించుకున్న నిర్మల.. రాత్రి న‌గ‌రంలోని మైలాపూర్ మార్కెట్‌లో ఆగారు. ఈ సందర్భంగా మార్కెట్‌లోని కూర‌గాయ‌ల వ్యాపారులతో ఆమె మాట్లాడారు. వారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ఆరా తీశారు.

అనంత‌రం ఆమె ఓ దుకాణం వ‌ద్ద ఆగి కూర‌గాయ‌లు కొన్నారు. ఓ బుట్ట తీసుకుని కూర‌గాయల‌ను ఏరుకున్న నిర్మల.. వాటిని కొనుగోలు చేశారు. కేంద్ర మంత్రి అయి ఉండి కూర‌గాయ‌ల మార్కెట్‌లో ఆగి కూర‌గాయల‌ను కొన్న మంత్రి వీడియోపై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ప‌లు ర‌కాల కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement