Thursday, March 28, 2024

ఉన్మాది ఘాతుకం, ప్రేమించలేదని కత్తితో దాడిచేయడంతో యువతి మృతి.. కఠినంగా శిక్షించాలన్న సీఎం జగన్​

కాకినాడ జిల్లా కాండ్రేగుల కూరాడలో ఓ యువతి ప్రేమోన్మాది ఘాతుకానికి బలైపోయింది. కూరాడ గ్రామంలో అమ్మమ్మ ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది డిగ్రీ ఫైనలియర్ విద్యార్థిని. అదే గ్రామానికి చెందిన వెంకట సూర్యనారాయణ ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడు. ఆ యువతి ఒప్పుకోకపోవడంతో కత్తితో దాడి చేయగా, ఆమె అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. నిందితుడు వెంకట సూర్యనారాయణను పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

దిశ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. చట్టంలో పేర్కొన్న విధంగా త్వరితగతిన కేసు విచారణ పూర్తి చేసి, నిర్ణీత సమయంలోగా చార్జిషీటు దాఖలు చేయాలని ఆదేశించారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన కేసుల విషయంలో దిశ చట్టంలో పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం ముందుకు సాగాలని సీఎం నిర్దేశించారు. తద్వారా, నేరానికి పాల్పడిన వ్యక్తికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement