Friday, May 3, 2024

నిరుద్యోగం, మ‌త‌త‌త్వాన్ని దేశం నుంచి స‌మూలంగా రూపుమాపాలి : ఎమ్మెల్సీ క‌విత‌

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వ‌హిస్తుంద‌ని, ఇందులో భాగంగా తెలంగాణ భవన్‌లో ర‌క్త‌దాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్సీ కవితతో కలిసి ఎంపీ కే కేశవరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత రక్తదానం చేశారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని చెప్పారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యల్లో పేదరికం ఒకటన్నారు. దేశం బాగుండాలంటే ప్రజలు బాగుండాలని తెలిపారు. నిరుద్యోగం, మతత‌త్వాన్ని సమూలంగా దేశం నుంచి రూపుమాపాలని వెల్లడించారు. ప్రపంచానికి దిక్సూచిలా భారతదేశం ఎదగాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement