Thursday, April 25, 2024

రక్తదానం మరొకరికి ప్రాణదానం : ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి

భూపాలపల్లి : రక్తదానం ఆపదలో ఉన్న మరొకరికి ప్రాణదానం అని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వంద పడకల ఆసుపత్రిలో స్వతంత్ర భారత 75వ జ్రోత్సవాల్లో భాగంగా బుధవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి, జిల్లా కలెక్టర్ తో కలిసి ప్రారంభించారు. ఈ శిబిరంలో సుమారు 200 మంది వరకు రక్తదాతలు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కలెక్టర్ రక్తదానం ఆవశ్యకత గురించి వివరించారు. అనంతరం రక్త దాతలకు సర్టిఫికెట్ లు, పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ హరిబాబు, మహాదేవపూర్ ఎంపీపీ రాణి భాయి ,ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆకుల సంజీవయ్య, డీఎంహెచ్ఓ ధన శ్రీరామ్, ఆర్ఎంవో డాక్టర్ ప్రవీణ్ కుమార్, జడ్పీ సీఈవో శోభారాణి, డిపి ఆశాలత, డిఏఓ విజయ భాస్కర్, జిల్లా పశువైద్యాధికారి డా.సదానందం, డిఆర్డిఏ పిడి పురుషోత్తం, నాయకులు చల్ల నారాయణ రెడ్డి, జిల్లాలోని అధికారులు, సిబ్బంది యువత, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement