Sunday, April 28, 2024

బీజేపీ పాలనలో సామాన్యులు బతకలేని పరిస్థితి : తమ్మినేని వీరభద్రం

హనుమకొండ: మూడోసారి దేశంలో అధికరణలోకి రావడం కోసం బీజేపీ తీవ్రంగా ప్రయత్నం చేస్తుందని దాన్ని ప్రజలు లౌకిక శక్తులు తిప్పి కొట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపు ఇచ్చారు. హనుమకొండ రాంనగర్ లో సీపీఎం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వీరభద్రం మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో సామాన్యులు బతకలేని పరిస్థితి ఏర్ప‌డింద‌న్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ దేశ సంపదని కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పుతున్నార‌న్నారు. బిజెపి యేతర ప్రభుత్వాలను, ప్రతిపక్ష నాయకులను దాడుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారర‌ని మండిప‌డ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు, రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడిందన్నారు. బీజేపీని ఓడిచడం వల్లే దేశం రక్షించబడుతుంద‌న్నారు. ప్రజలు సిద్ధం కావాలని పిలుపు ఇచ్చారు. ఈ సమావేశానికి సీపీఎం జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి అధ్య‌క్షత వహించగా.. నాయకులు జగదీష్, సారంపల్లి వాసుదేవ రెడ్డి, ఎం.చుక్కయ్య, మంద సంపత్, గొడుగు వెంకట్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement