Tuesday, May 7, 2024

జ‌మ్ము కాశ్మీర్ లో ఉగ్రవాదులను పట్టుకున్న గ్రామస్థులు.. 2 లక్షల రివార్డు ప్రకటించిన డిజీపీ..

జ‌మ్ము కాశ్మీర్ లోని రియాసి జిల్లాకి చెందిన‌ తుక్సాన్ గ్రామంలో ఇద్దరు ఎల్‌ఇటి ఉగ్రవాదులను ఆయుధాల‌తో స‌హా ప‌ట్టుకుని పోలీసుల‌కి అప్ప‌గించారు అక్క‌డి గ్రామస్థులు. ప‌ట్టుప‌డ్డ‌వారు పుల్వామాకు చెందిన బషీర్ అహ్మద్ దార్ కుమారుడు ఫైజల్ అహ్మద్ దార్, రాజౌరీకి చెందిన హైదర్ షా కుమారుడు తాలిబ్ హుస్సేన్ “కేటగిరీ టెర్రరిస్ట్” గా పోలీసులు గుర్తించారు. వీరిని ప‌ట్లుకుని పోలీసుల‌కు అప్ప‌గించినందుగాను గ్రామస్థుల ధైర్యానికి హ్యాట్సాఫ్ చుబుతూ.. డిజీపీ ఆ గ్రామస్తులకు రూ.2 లక్షల రివార్డును ప్రకటించారని పోలీసులు తెలిపారు.

ప‌ట్టుబ‌డ్డ నిందితుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ( రెండు AK రైఫిళ్లు, 7 గ్రెనేడ్లు, పిస్టల్. ) స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement